అక్షరటుడే, వెబ్డెస్క్ : Mallareddy | పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ex minister mallareddy అన్నారు. భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీకి సంఘీభావంగా శనివారం మల్లారెడ్డి కాలేజీలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాక్ పక్కలో బల్లెంలా తయారు అయిందన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. 75 ఏళ్ల నుంచి మనం పాకిస్తాన్తో బాధలు పడుతూనే ఉన్నామన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మోదీని కోరారు. మరోసారి భారత్ వైపు చూడాలంటే పాక్ వణికిపోయేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత సైన్యానికి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్నారు.