అక్షరటుడే, వెబ్డెస్క్: Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (Vemulawada Sri Rajarajeswara Swamy Devasthanam) పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Chief Minister A. Revanth Reddy)ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government vip Adi Srinivas) కోరారు. ఆధునిక గోశాల నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం(Dr. BR Ambedkar Secretariat)లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్.. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), మంత్రులు(Ministers) దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), వాకిటి శ్రీహరి(Vakiti Srihari)తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.