అక్షరటుడే, వెబ్డెస్క్ : Mock Drill | దాయాదితో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా దళాలు Security forces మాక్డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 7న బుధవారం పలు రాష్ట్రాల్లో ఈ డ్రిల్ చేపట్టాలని సూచించింది. వైమానిక దాడుల Air strikes హెచ్చరికలు చేసే సమయంలో పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ఉద్దేశం. దేశంలో ఇలాంటి మాక్డ్రిల్ చివరిసారిగా 1971లో నిర్వహించారు. ఆ సమయంలో భారత్ bharat, పాకిస్తాన్ pakistan రెండూ యుద్ధానికి దిగాయి. ఆ సమయంలో పౌరుల భద్రతా దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహించగా, తాజాగా మరోసారి అలాగే చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Mock Drill | ఉద్రిక్తతల వేళ..
ఏప్రిల్ 22న జరిగిన జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ pahalgamలో జరిగిన ఉగ్రవాద దాడి terror attack తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. పరస్పర ప్రతీకార చర్యలతో రెండు దేశాలు యుద్ధం అంచున నిలిచాయి. ఇలాంటి తరుణంలో “సమర్థవంతమైన పౌర రక్షణ” కోసం బుధవారం భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం పలు రాష్ట్రాలకు సూచించింది.
డ్రిల్లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ల నిర్వహణతో పాటు శత్రువులు దాడి చేసే సమయంలో పౌరులు తమను తాము రక్షించుకోవడం వంటి వాటిపై పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి మరల్చడంపై అవగాహన కల్పిస్తారు.