More
    HomeతెలంగాణMLC Kavitha | బీఆర్​ఎస్​ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | బీఆర్​ఎస్​ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్(BRS)​ అధినేత కేసీఆర్(KCR)​ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ పార్టీనీ బీజేపీలో (brs – bjp merging) కలపాలని చూస్తున్నారని అన్నారు. ఆమె గురువారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేయొద్దని తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆమె తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ లేఖను బయట పెట్టింది ఎవరని కవిత ప్రశ్నించారు.

    కవిత కొత్త పార్టీ పెడతారని, కాంగ్రెస్​లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీలో బీఆర్​ఎస్​లో విలీనం చేస్తామని తాను జైలులో ఉన్నప్పుడే అడిగారని ఆమె పేర్కొన్నారు. తనకు వెన్ను పోటు రాజకీయాలు తెలియవని ఆమె తెలిపారు.

    READ ALSO  Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    MLC Kavitha | పార్టీ నడిపే తీరు ఇదేనా..

    తాను కేసీఆర్​లా చాలా తిక్క ఉన్న మనిషినని.. ఎవరికీ భయపడనని కవిత అన్నారు. పార్టీని నడిపే తీరు ఇదేనా అని ఆమె మండిపడ్డారు. పరోక్షంగా కేటీఆర్​(KTR)ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చేతకాని వారు తనకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో కవిత బీఆర్​ఎస్​తో తెగదింపులు చేసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    MLC Kavitha | పార్టీ ఎందుకు ఖండించలేదు

    ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్​ వద్దన్నారని ఆమె తెలిపారు. తన జోలికి వస్తే బాగుండదని కవిత హెచ్చరించారు. తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పార్టీ సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేశారన్నారు. బీఆర్​ఎస్​లో కేసీఆర్‌ ఒక్కరే నాయకుడని కవిత అన్నారు.

    READ ALSO  Ex Mla Jeevan Reddy | కుట్రలో భాగంగానే కేసీఆర్​కు నోటీసులు

    MLC Kavitha | నన్ను కావాలనే ఓడించారు

    కాంగ్రెస్‌(Congress) పార్టీ ఓ మునిగిపోయే నావ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తనకు, కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో(MP Elections) ఓడించారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Latest articles

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...

    Nizamabad Collector | కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Collector | నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని రాష్ట్ర సహకార...

    More like this

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...