అక్షరటుడే, వెబ్డెస్క్: MLA Arikepudi Gandhi | హైదరాబాద్ నగరంలోని మాదాపూర్(Madhapur)లో గల సున్నం చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ చెరువులో కలుషిత జలలాతో ప్రజారోగ్యానికి ముంపు పొంచి ఉందని ఇటీవల హైడ్రా(Hydraa) పేర్కొంది. చెరువులో ఆక్రమణలు తొలగించి.. మంచినీటితో నింపుతామని అధికారులు అన్నారు. ఈ క్రమంలో సోమవారం హైడ్రా సిబ్బంది సున్నం చెరువు బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. అయితే కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అడ్డుకున్నారు.
MLA Arikepudi Gandhi | నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా తీరు
హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సున్నం చెరువు(Lime pond) వద్దకు చేరుకొని ఆయన కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్ హద్దులు నిర్ణయించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలని హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. కానీ హైడ్రా అధికారులు(Hydra Officers) మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తీరుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కాగా అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు.
MLA Arikepudi Gandhi | ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు
సున్నం చెరువులో హైడ్రా అధికారులు ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు కొనసాగించారు. ఎమ్మెల్యే అడ్డుకున్నా.. స్థానికులు జేసీబీలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపినా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. భారీ బందోబస్తు మధ్య అధికారులు చెరువు బఫర్ జోన్లోని నిర్మాణాలను కూల్చివేశారు.