అక్షరటుడే, వెబ్డెస్క్ : Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి గట్టి షాక్ తగిలింది. డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ (Subedari Police Station)కు తరలించారు. శనివారం సాయంత్రం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రిమాండ్ విధించారు. కాసేపట్లో ఆయన్ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారు.
కమలాపురం (Kamalapur) మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తనపై కేసు కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను హైకోర్టు (High Court telangana) తోసిపుచ్చడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.