More
    HomeతెలంగాణMla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్‌.. కార‌ణం ఏంటంటే..!

    Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్‌.. కార‌ణం ఏంటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mla Koushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని padi kaushik reddy వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో అదుపులోకి తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసి అక్క‌డి నుండి వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనపై భారతీయ శిక్షా స్మృతి (BNS)లోని సెక్షన్ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని(Huzurabad Mla) మరికాసేపట్లో కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. సుబేదారి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈ విషయంలో చుక్కెదురైంది.

    READ ALSO  Hyderabad | హైదరాబాద్​లో కొత్తగా స్టార్​ హోటళ్లు

    Mla Koushik Reddy | కీల‌క ప‌రిణామం..

    కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. జూన్ 16న దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్​ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్ట్‌పై స్టే ఇచ్చిన కోర్టు, దర్యాప్తునకు సహకరించాలని అప్పట్లో ఆదేశించింది. తాజాగా పిటిషన్ కొట్టివేయడంతో కౌశిక్ రెడ్డి అరెస్ట్‌(Kaushik Reddy arrest)కు మార్గం సుగమమైంది.

    బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న కౌశిక్ రెడ్డిని కావాలనే అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy), ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిలపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ సీఐ రాఘవేంద్ర తన ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని, తనను చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. వాగ్వాదం తీవ్రం కావడంతో, సీఐ రాఘవేంద్ర తన విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

    READ ALSO  Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల

    Latest articles

    Minister Adluri Laxman | బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

    అక్షరటుడే, హైదరాబాద్:Minister Adluri Laxman | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ(SC, ST and...

    Trump Nobel Prize | ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాల‌ని పాక్ ప్ర‌తిపాదిన.. రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌ప‌డుతున్న బంధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Nobel Prize | అమెరికా, పాకిస్తాన్ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోంది. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల...

    Delhi Government | జూలై 1 నుండి ఆ వాహ‌నాల‌కి పెట్రోల్ బంద్.. ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Delhi Government | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగ‌తి...

    DA Hike | విద్యుత్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. డీఏ ప్రకటించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :DA Hike | రాష్ట్ర ప్రభుత్వం(State Government) విద్యుత్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్​...

    More like this

    Minister Adluri Laxman | బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

    అక్షరటుడే, హైదరాబాద్:Minister Adluri Laxman | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ(SC, ST and...

    Trump Nobel Prize | ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాల‌ని పాక్ ప్ర‌తిపాదిన.. రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌ప‌డుతున్న బంధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Nobel Prize | అమెరికా, పాకిస్తాన్ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోంది. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల...

    Delhi Government | జూలై 1 నుండి ఆ వాహ‌నాల‌కి పెట్రోల్ బంద్.. ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Delhi Government | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగ‌తి...