అక్షరటుడే, వెబ్డెస్క్: Israel – Iran War : ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ వార్తా ఛానల్ (Iranian government news channel) బిల్డింగ్పై ఇజ్రాయెల్ మిస్సైల్తో దాడి చేసింది. స్టూడియో(studio)లో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్(missile) భవనంపై పడింది.
దీంతో భవనం షేక్ అయి, పవర్ కట్ అయింది. గజగజ వణికిపోయిన న్యూస్ యాంకర్ అక్కడి నుంచి పరుగులు తీసింది. మరోవైపు అటు ఇద్దరు మొసాద్ ఏజెంట్లను ఇరాన్ సజీవంగా పట్టుకుంది. వారి వద్ద పెద్ద మొత్తంలో ఉన్న ఆయుధాల(weapons)ను స్వాధీనం చేసుకుంది.