అక్షరటుడే, నిజాంసాగర్ : Indiramma houses : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో నియోజకవర్గంలో 3500తో పాటు అదనంగా మరో ఎనిమిది వందల ఇళ్లు అదనంగా మంజూరైనట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ శివారులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాలలో ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గతంలోనే ఇందిరమ్మ కమిటీల(Indiramma committees)ను ఏర్పాటు చేశామని, కమిటీల ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విడతల వారీగా జరుగుతుందన్నారు. నిర్మాణ పనులు జరిగే తీరును బట్టి బిల్లుల విడుదల సవ్యంగా కొనసాగుతుందన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలానికి చెందిన నాయకుడు 35 ఏళ్లుగా టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ నిలకడ లేకుండా పార్టీలలో తిరుగుతూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అదనంగా మంజూరు చేయిస్తామని మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. సదరు వ్యక్తి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామన్నారు. సమావేశంలో నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్ , ప్రజాపండరి లక్ష్మయ్య, రాజారాం, బాల సాయిలు, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.