అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad | మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల(KOS)లో విద్యార్థులకు మంగళవారం ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పలువురు పాఠశాల స్థాయి విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే స్కూల్ బస్సుల డ్రైవర్లకు పూర్తి ఫిట్నెస్ ఉంటేనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు, ఇన్ఛార్జి వైకే సంపత్ తదితరులు పాల్గొన్నారు.