ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | అధికారులు పనితీరు మార్చుకోవాలి: మంత్రి సీతక్క

    Minister Seethakka | అధికారులు పనితీరు మార్చుకోవాలి: మంత్రి సీతక్క

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | అధికారులపై ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో ఫిర్యాదు చేస్తున్నారని.. వారు పనితీరు మార్చుకుని ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి సీతక్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవం (vana mahotsavam) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సమీక్షలో మాట్లాడుతూ.. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని, పైప్​లైన్​ లీకేజీలను అరికట్టాలన్నారు.

    Minister Seethakka | జీపీ కార్యదర్శులపై ఫిర్యాదులు..

    జీపీ హెడ్ క్వార్టర్స్​లో పంచాయతీ కార్యదర్శులు ఉండడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యదర్శులు స్థానికంగా ఉండి ఉదయాన్నే పంచాయతీ సిబ్బందిని పర్యవేక్షిస్తే ఏ సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని సూచించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ కలెక్టర్​ స్థాయిలో కార్యదర్శులను బదిలీ చేసే అవకాశాలున్నాయన్నారు.

    READ ALSO  Kalthi Kallu | ఉమ్మడి జిల్లాలో జోరుగా కల్తీ కల్లు దందా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

    Minister Seethakka | వాటర్​ట్యాంక్​లు క్లీన్​ చేయట్లేదు..

    జిల్లావ్యాప్తంగా వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. సీజనల్​ వ్యాధులు రాకుండా గ్రామాల్లో చర్యలు తీసుకోవాలన్నారు. తన నియజకవర్గంలో ఏ గ్రామంలో కూడా వాటర్ ట్యాంకులు శుభ్రం చేయట్లేదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు (Jukkal MLA Laxmikant Rao) మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్​లు లేక అధికారుల పర్యవేక్షణ లేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో వాట్సాప్​ గ్రూప్​లు తయారుచేయాలని.. ఎమ్మెల్యేలను అందులో చేర్చాలని సూచించారు.

    Minister Seethakka | వైద్యుల కొరత వేధిస్తోంది..

    వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, వైద్యాధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ఎర్రపహాడ్ ఆస్పత్రిలో (Yerrapahad Hospital) మందుల కొరత ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Yella Reddy MLA Madan Mohan Rao) తెలిపారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొనగా సూపరింటెండెంట్​ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నోటిఫికేషన్​ ఇచ్చినా ఎవరూ రావట్లేదని బదులిచ్చారు. మద్నూర్ ఆస్పత్రిలో కరెంట్ లేక ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదని, వెంటనే ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

    READ ALSO  Minister Seethakka | అధికారులు మనసు పెట్టి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు: సీతక్క

    Minister Seethakka | ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి..

    ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేస్తేనే కొత్త వాటి మంజూరుకు అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయని హౌసింగ్ అధికారి విజయ్​పాల్​ పేర్కొనగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లకు ఇసుక కొరత ఉండవద్దని సూచించారు. విడతల వారీగా పూర్తయిన ఇళ్లకు పేమెంట్ చేయడం లేదని ఎమ్మెల్యే పోచారం తెలిపారు. తాను ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్తానన్నారు. గ్రౌండ్ లెవల్​లో అధికారులు పర్యటించడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఉందని ఎమ్మెల్యేలంతా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై తాను మంత్రి పొంగులేటితో మట్లాడతానన్నారు.

    Minister Seethakka | ఇంకా ఎన్ని రోజులు కడతారు..?

    మహిళా శక్తి భవన నిర్మాణంపై మంత్రి సంబంధిత అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇంకా పూర్తి కాలేదని చెప్పడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే డబ్బులు కూడా ఇచ్చామని తెలిపారు. జిల్లాలో అంగన్​వాడీ భవనాల నిర్మాణాలు కూడా పూర్తి కాకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో భవనానికి రూ.12 లక్షలు ఇస్తున్నా ఇంకా పనులు పూర్తి చేయకపోవడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల అంగన్​వాడీలకు భవనాలు లేవన్నారు. ఏడాదికి 2, 3 వేల చొప్పున పూర్తిచేసేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో 14,500 అంగన్​వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

    READ ALSO  Minister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

    Latest articles

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    More like this

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...