Home క్రీడలు IPL 2025 | అంబానీ గొప్ప మనసు.. మ్యాచ్‌కు 19 వేల మంది చిన్నారులు!

IPL 2025 | అంబానీ గొప్ప మనసు.. మ్యాచ్‌కు 19 వేల మంది చిన్నారులు!

0
IPL 2025 | అంబానీ గొప్ప మనసు.. మ్యాచ్‌కు 19 వేల మంది చిన్నారులు!
IPL 2025 | అంబానీ గొప్ప మనసు.. మ్యాచ్‌కు 19 వేల మంది చిన్నారులు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | ముంబై ఇండియన్స్ MI ఓనర్ నీతా అంబానీ Nita Ambani గొప్ప మనసు చాటుకున్నారు. “అందరికీ విద్య, క్రీడలు(ESA)” అనే కార్యక్రమం ద్వారా 19వేల మంది చిన్నారులకు ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ LSG, ముంబై ఇండియన్స్ MI ఐపీఎల్ IPL 2025 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు. 2010 నుంచి ముంబై ఇండియన్స్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఈ సారి భారీ సంఖ్యలో చిన్నారులు హాజరయ్యారు.

ESA డే.. అందరికీ విద్య మరియు క్రీడలు (Education and Sports for All) అనేది ముంబై ఇండియన్స్ MI, రిలయన్స్ ఫౌండేషన్ Reliance Foundation సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. చిన్నారులకు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముంబై ఇండియన్స్ నిర్వహిస్తోంది. వివిధ ఎన్జీవోల NGO’s సాయంతో పేద పిల్లలకు ప్రత్యక్షంగా ఐపీఎల్ IPL మ్యాచ్‌ను చూపించే అవకాశం కల్పిస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ LSG వర్సెస్ ముంబై ఇండియన్స్ MI మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు. ఇది చాలా ప్రత్యేకమైన మ్యాచ్ అని, చిన్నారులు ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారని తెలిపారు. వారి కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆటగాళ్లను కోరారు. కాగా ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి 215 పరుగులు చేసింది.

Exit mobile version