అక్షరటుడే, వెబ్డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori ) నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాన్సర్ను ఎదుర్కోవడానికి బ్రాకీథెరపీ, రేడియోధార్మిక ఇంప్లాంటేషన్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణ, నియంత్రణ కోసం సలహాదారుగా నియమించింది.
కాగా కృష్ణా జిల్లా (Krishna District)కు చెందిన దత్తాత్రేయుడు రేడియేషన్ అంకాలజిస్ట్ (Radiation Oncologist)గా పేరు ప్రఖ్యాతలు సాధించారు. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం క్యాన్సర్ విభాగానికి అధికారిగా పని చేస్తున్నారు.
అయితే 2025 మార్చి 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనను సలహాదారుగా నియమించింది. ఆయన రెండేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను సలహాదారుగా నియమించడం గమనార్హం.