అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mediation Centers | సమస్యల పరిష్కారానికే సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి భరత లక్ష్మి (District Judge Bharatha Lakshmi) అన్నారు. సోమవారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ (Indure Youth Voluntary Service Organization) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల ప్రకారం.. మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొందరు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి, నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) కార్యదర్శి, సివిల్ జడ్జి జి ఉదయ్ భాస్కర్ రావు (Civil Judge Uday Bhaskar), ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు సాయిబాబు, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.