అక్షరటుడే, వెబ్డెస్క్ : IAS Transfers | రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. 33 మంది ఐఏఎస్, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు కీలక స్థానాల్లో ఉన్న అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను సైతం బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
IAS Transfers | త్వరలో ఎన్నికలు.. నూతన చట్టం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో పలువురు కలెక్టర్లను బదిలీ చేసింది. అలాగే.. మంచి పేరున్న అధికారులకు కీలకమైన శాఖలను కట్టబెట్టింది.
బదిలీ అయిన IAS అధికారుల జాబితా ఇదే..



