అక్షరటుడే, వెబ్డెస్క్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో బదిలీల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఎస్సైలు, సీఐలు, తహశీల్దార్ల బదిలీలు కూడా చేపట్టింది. తాజాగా పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్లను ట్రాన్స్ఫర్(Municipal Commissioners Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి(Municipal Secretary Dr. TK Sridevi) ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్లలో పలువురికి ప్రమోషన్లు సైతం కల్పించారు.
Municipal Commissioners Transfer | స్థానిక ఎన్నికల కోసమేనా..
రాష్ట్రంలో కొంతకాలంగా అధికారుల బదిలీలు చేపడుతున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి మొదలు పెడితే ఐపీఎస్ అధికారుల వరకు బదిలీలు చేపట్టారు. సోమవారం సైతం మల్టీ జోన్ –1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేశారు. అలాగే తహశీల్దార్లు, ఐఏఎస్ అధికారులను సైతం ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా భారీ మొత్తంలో మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగించారు. అయితే రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారుల బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.