అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor Seized | అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు(Excise Police) పట్టుకున్నారు. జూన్ 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా రూ.25 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర టాస్క్ ఫోర్స్(STF), జిల్లా టాస్క్ ఫోర్స్(DTF) స్థానిక ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ ఆపరేషన్లో మొత్తం 64 కేసులు నమోదు చేసి, 33 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Liquor Seized | నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్
ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా ట్యాక్స్ చెల్లించుకుండా తీసుకొచ్చిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 22 లీటర్ల బీరు, 21 లీటర్ల దేశీయ మద్యంతో సహా 1,188 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాకు ఉపయోగించిన 19 వాహనాలను సైతం సీజ్ చేశారు. ఎక్కువగా శంషాబాద్, సరూర్నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.