అక్షరటుడే, వెబ్డెస్క్ :Punjab | పంజాబ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీముక్త్సర్ సాహిజ్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీ (Fireworks factory)లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు దాటికి భవనం కుప్పకూలింది.
ప్రమాద విషయం తెలిసిన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ 27 మందిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. సదరు ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన కాంట్రాక్టర్ రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.