అక్షరటుడే, వెబ్డెస్క్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు maoists మృతి చెందారు. 11 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్తం పూర్తి చేశారు. కాగా మావోయిస్టులను లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ operation kagar చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బలగాలు అడవులను జల్లెడ పడుతూ మావోల పని పడుతున్నాయి.
Encounter | ఆపరేషన్ కర్రెగుట్టలకు బ్రేక్
తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు Telangana-Chhattisgarh borderలోని కర్రెగుట్టలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టాయి. భారీ సంఖ్యలో బలగాలు గుట్టలను చుట్టముట్టిన బలగాలు కర్రెగుట్టలపై పట్టు సాధించాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకొని పలువురు మావోయిస్టులు మృతి చెందారు. బలగాలు పలు గుట్టలను స్వాధీనం చేసుకున్నాయి.
బేస్క్యాంపుల ఏర్పాటు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆపరేషన్ కర్రెగుట్టలను నిలిపి వేసింది. బలగాలను వెనక్కి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కర్రెగుట్టల్లో తుపాకీ మోతలు ఆగిపోయాయి. అయితే బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో బలగాలు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి.