అక్షరటుడే, అక్షరటుడే: Bodhan | పట్టణంలో ఓ యువకుడి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ నారాయణ (CI Venkat Narayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎఫ్ఆర్సీ దాబా (FRC Dhaba) వద్ద గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కార్తీక్ అనే యువకుడి వద్ద పోలీసులు 19 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్తీక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Bodhan | రెంజల్బేస్ కేంద్రంగా…
పట్టణంలోని గతంలోనూ గంజాయి ఆనవాళ్లు కనిపించాయి. కేవలం 9కి.మీ దూరంలోనే మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ఉండడం.. చెక్పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా కొరవడడంతో నిషేధిత మత్తు పదార్థాలు యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దు దాటుతున్నాయి. గతంలో పట్టణంలోని రెంజల్బేస్లో (Renjal Base) ఓ వ్యక్తినుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఓ యువకుడు గంజాయితో పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది.