అక్షరటుడే, వెబ్డెస్క్: Maoists | ఆపరేషన్ కగార్ (Operation Kagar) ఆపాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో ఏవోబీ(AOB), తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులు (Telangana-Chhattisgarh borders), ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Maoists | ఆపరేషన్ కగార్తో బలహీనం
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పార్లమెంట్లో ప్రకటన కూడా చేశారు. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. ఆపరేషన్లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. తమకు కంచు కోటగా ఉన్న అడవుల్లోకి సైతం బలగాలు చొచ్చుకు వస్తుండడంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో భారీగా కేడర్ను మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. మరోవైపు కీలక నేతలు సైతం నేలకొరిగారు. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు కోరుతున్నారు. అయితే కేంద్రం చర్చలకు ముందుకు రావడం లేదు. ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోవాలని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు.