అక్షరటుడే, వెబ్డెస్క్: Mansarovar Yatra | హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇండియా (India), చైనా (China) మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా తీర్థయాత్ర చాలా సంవత్సరాలుగా నిలిచి పోయింది. అయితే, సిక్కింలోని నాథు లా మార్గం ద్వారా యాత్ర (Yatra) తిరిగి ప్రారంభమవనుంది. జూన్ 15న 50 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ గాంగ్టక్ చేరుకోనుంది.
యాత్రికుల భద్రత, సౌకర్యం, శ్రేయస్సు దృష్ట్యా సిక్కిం ప్రభుత్వం (Sikkim government) విస్తృతమైన సన్నాహాలు చేసిందని ‘ది స్టేట్స్మన్’ వెల్లడించింది. ప్రతి యాత్రికుల బృందంతో పాటు ఇద్దరు అధికారులు ప్రయాణమంతా వెంట ఉంటారని సిక్కిం పర్యాటక (Sikkim Tourism), పౌర విమానయాన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సీఎస్ రావు చెప్పారు. యాత్రికులు ఎత్తయిన తీర్థయాత్రకు వెళ్లే ముందు గాంగ్టక్లో ఐదు రోజుల తప్పనిసరి వాతావరణ ఇబ్బందులకు గురవుతారు. ఈ నేపథ్యంలో యాత్ర మార్గంలో కీలకమైన ప్రదేశాలలో వైద్య సౌకర్యాలు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు రావు తెలిపారు.
జూన్ 20న నాథు లా ద్వారా మొదటి బృందం చైనాలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ (Sikkim Chief Minister Prem Singh Tamang) కనుమ వద్ద జెండా ఊపి మొదటి బ్యాచ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. నాథు లా మార్గంతో (Nathu La route) పాటు మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఉంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ కంటే శారీరకంగా తక్కువ శ్రమతో కూడుకున్నది. అలాగే అత్యంత సుందరమైనది. నాథు లా మార్గం తాత్కాలికంగా నిలిపివేయబడడానికి ముందే ఇది యాత్రికుల ఆదరణ పొందింది.