అక్షరటుడే, వెబ్డెస్క్: Nalgonda | నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం(Extramarital Affair) నెపంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం(Nakirekal Mandal) నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య (34)ను కొందరు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి(Nalgonda Government Hospital)కి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.