అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | చెట్టును టీవీఎస్ ఎక్సెల్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సుల్తాన్నగర్ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నగర్ (mahammad nagar) మండల కేంద్రానికి చెందిన గని(30) అనే వ్యక్తి పెట్రోల్ విక్రయిస్తూ జీవిస్తున్నాడు.
సోమవారం ఉదయం నిజాంసాగర్లోని పెట్రోల్ పంప్కు (Petrol pump) వెళ్తుండగా సుల్తాన్పూర్ గ్రామ శివారులో కల్లు దుకాణం వద్ద ఎక్సెస్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కాగా గని అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య షహనాజ్ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.