అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahesh babu | సూపర్స్టార్ మహేశ్బాబు నేడు ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కు (hyderabad) చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లకు (rela estate companies sai surya developers and surana groups) సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate)(ED) మహేష్ బాబును ప్రశ్నించనుంది. ఈ కంపెనీలు అనధికార ప్లాట్లను విక్రయించడం, ప్రాజెక్ట్లను పూర్తిచేయకుండా ఇళ్లు కొన్నవారిని మోసం చేశాయి. అయితే ఈ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా మహేశ్బాబు వ్యవహరించారు. ఆయన ప్రమోషన్ కోసం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
Mahesh babu | గతంలోనే నోటీసులు
మహేశ్బాబుకు (mahesh babu) ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఈడీ అధికారులు (ED officials) ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ (ED officials issued notice) చేశారు. అయితే ఏప్రిల్ 22న ఆయన విచారణకు హాజరు కాలేదు. తాను షూటింగ్లో ఉండటంతో రాలేకపోయానని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు ఈరోజు విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన విచారణకు వస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది.