అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Results | నీట్ ఫలితాలపై NEET Results | మద్రాస్ హైకోర్టు madras high court స్టే విధించింది. తమ పరీక్ష కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పరీక్ష exam సరిగ్గా రాయలేకపోయామని పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్రంలో కరెంట్ పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఫలితాలను విడుదల చేయొద్దని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు madya pradesh high court సైతం స్టే విధించింది.
మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 20.8 లక్షల మంది పరీక్ష రాశారు. వారు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కోర్టులు స్టే ఇవ్వడంతో ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.