అక్షరటుడే, వెబ్డెస్క్: Sub Registrar Office | రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే రెవెన్యూ శాఖ(Revenue Department) ఎంతో కీలకమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. అయినా ప్రభుత్వాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Registrar Offices) కనీస వసతులు కల్పించడం లేదు. పలు ప్రాంతాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఆయా ఆఫీసుల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు భవన యజమాని తాళం వేశాడు.
Sub Registrar Office | పెండింగ్లో 40 నెలల అద్దె
రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిధుల లేమితో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు, పాఠశాలలకు నిధులు చెల్లించడం లేదు. దీంతో భవన యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అద్దె చెల్లించడం లేదని రంగారెడ్డి జిల్లా(Rangareddy District) అబ్దుల్లాపూర్మెట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశాడు. 40 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడం గమనార్హం. అద్దె విషయంపై డిస్ట్రిక్ రిజిస్ట్రార్(District Registrar)కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశాడు. దీంతో కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.
Sub Registrar Office | గురుకుల పాఠశాలలకు..
రాష్ట్ర ప్రభుత్వం పలు గురుకుల పాఠశాలలను అద్దె భవనాల్లో కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వాటి బకాయిలు కూడా పేరుకుపోయాయి. దీంతో పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా జూన్ 12న పలు పాఠశాల భవనాలకు యజమానులు తాళాలు వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో భవన యజమానులు తాళాలు తీశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా.. అద్దె బకాయిలు మాత్రం ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘