అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ రాజేష్ చంద్ర (kamareddy SP Rajesh chandra) తెలిపారు. పోలీసు శాఖలో (Police Department) పనిచేసి రిటైర్ అయిన డీసీఆర్బీ డీఎస్పీ మదన్ లాల్, ఎస్సై నర్సింలు, ఏఆర్ ఎస్సై నీలంరెడ్డి, దోమకొండ హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాశ్కు శనివారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. పోలీసుల సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా గడపడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని, లేకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు జార్జ్, తిరుపతయ్య, శ్రీధర్, శ్రీనివాసులు, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ, సంతోష్ కుమార్, ఆర్ఎస్సైలు, ఎస్సైలు పాల్గొన్నారు.