అక్షరటుడే, లింగంపేట: Lingampet | లింగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మహిళా సంఘాల సభ్యులకు ‘అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా సంఘాల సభ్యులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఏపీఎం శ్రీనివాస్, కార్యదర్శి శ్రావణ్ కుమార్, పురోహితుడు శంకర్ పంతులు, సీసీ మెహర్ తదితరులు పాల్గొన్నారు.
