అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ operation Sindoor తో ఉలిక్కిపడ్డ పాక్ సామాన్య పౌరులు, ఆలయాలు, ఎయిర్పోర్టులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది.
దాయది దేశం దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy ప్రజాప్రతినిధులకు కీలక సూచన చేశారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు mla, ఎమ్మెల్సీలు mlcల ఒక నెల వేతనం నేషనల్ డిఫెన్స్ ఫండ్ national defence fundకు విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka విరాళం ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకు రావాలని సీఎం కోరారు.