More
    Homeజిల్లాలునిజామాబాద్​Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Leopard | చనిపోతున్న చిరుతలు.. జిల్లాలో వరుస ఘటనలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Leopard | అడవిలో ఉండాల్సిన చిరుతలు జనాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి. ఇందల్వాయి అటవీ రేంజ్‌ పరిధిలో (Indalwai forest range) ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటవీ అధికారులు తిరిగి వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.

    సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో (Sirnapalli forest area) 2018లో రైలు ఢీకొని ఓ చిరుత గాయపడింది. దానికి చికిత్స అందించేందుకు అధికారులు హైదరాబాద్‌ తరలించగా కొద్ది రోజులకు చనిపోయింది. దేవి తండా వద్ద జాతీయ రహదారిపై (national highway) 2022 ఫిబ్రవరి నెలలో ఆర్టీసీ బస్సు (RTC bus hits) ఢీకొని మరో చిరుత మృతి చెందింది. గతేడాది చంద్రాయన్‌పల్లి, దగ్గి అటవీ ప్రాంతాల మధ్య కారు ఢీకొనడంతో ఓ చిరుత పులి తీవ్రంగా గాయపడింది. చంద్రాయన్‌పల్లి పెద్దమ్మ ఆలయం వద్ద ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో మరో చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చంద్రాయ న్‌పల్లి (Chandrayanpally) వద్ద మరో చిరుత మృతి చెందింది.

    READ ALSO  Armoor | అర్ధరాత్రి వరకు దాబా తెరిచి ఉంచిన వ్యక్తికి జైలుశిక్ష

    Leopard | జాతీయ రహదారిపైనే అధికం..

    ఇందల్వాయి మండలం (Indalwai mandal) మీదుగా జాతీయ రహదారి 44 (National Highway 44) ఉంది. కాగా.. ఈ మార్గంలో అటవీ ప్రాంతం (forest area) విస్తరించి ఉంది. రోడ్డుకు ఇరువైపులా అటవీ ప్రాంతం ఉండడంతో రోడ్డును దాటే క్రమంలో చిరుతలు హైవేపై వాహనాలు ఢీకొని మృతి చెందుతున్నాయి.

    Leopard | చెట్లు నరకడంతో..

    అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు అడవులను వదిలి బయటకు వస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేసి వ్యవసాయ భూములుగా (agricultural lands) మారుస్తున్నారు. దీంతో వన్యప్రాణులు అడవిని వదిలి బయటకు వస్తున్నాయి. మరోవైపు వేసవిలో వన్యప్రాణుల తాగునీటి (drinking water) కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

    Leopard | కంచె ఏర్పాటు చేయాలి

    చంద్రాయన్‌పల్లి నుంచి దగ్గి (Chandrayanpally to Daggi) వరకు సుమారు ఐదు కి.మీ. మేర 44వ జాతీయ రహదారికి ఇరుపక్కల దట్టమైన అడవి ఉంది. అర్ధరాత్రి వేళ వన్యప్రాణులు (wild animals) అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్తుంటాయి. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచె ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉంది.

    READ ALSO  Kiledi new fraud | కిలేడీ నయా మోసం.. దంపతులకు అనాథనని నమ్మించి నిలువు దోపిడీ..

    Latest articles

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    More like this

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...