అక్షరటుడే, వెబ్డెస్క్ : Lashkar-e-Taiba | లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హతంలష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ Saifullah Khalid హతమయ్యాడు. పాకిస్తాన్ (pakistan)లో ఖలీద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ (top commandor) సైఫుల్లాను సింధ్ ప్రావిన్స్(sindh province)లో గుర్తు తెలియని దుండగులు హతమార్చినట్లు సమాచారం. వినోద్ కుమార్, మొహమ్మద్ సలీం, ఖలీద్, వానియల్, వాజిద్, సలీం భాయ్ వంటి మారుపేర్లతో కూడా పిలువబడే సైఫుల్లా లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, నిధుల సేకరణ, భారత్లోకి ఉగ్రవాదులను పంపడంతో సైఫుల్లా కీలకంగా వ్యవహరించేవాడు.
Lashkar-e-Taiba | నేపాల్ నుంచి..
లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పని చేస్తున్న సైఫుల్లా ఉగ్రవాదులను నేపాల్ nepal నుంచి భారత్లోకి పంపించేవాడు. భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక సైఫుల్లా హస్తం ఉంది. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ nagapoor rss కేంద్ర కార్యాలయంపై, 2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర ఉంది. 2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి ఘటనలో కూడా నిందితుడిగా ఉన్నాడు. చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్, ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం జరిపిన కాల్పుల్లో మరణించినట్లు సమాచారం.