అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీగా నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని మూసారాంబాగ్ లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు గురువారం దాడి చేశారు.
ఈ దాడిలో రూ.5.21 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తి వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ స్టాక్లో యాంటీ-డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్స్, అబార్షన్ కిట్లు ఉన్నాయి. ఈ మేరకు నకిలీ మందులను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా.. లక్ష్మణ్పై గతంలో సైతం నకిలీ మందుల కేసులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మందులు వినియోగిస్తే ప్రజల ఆరోగ్యానికి హానికరమని వారు పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తునట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.