అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), నూడా ఛైర్మన్ కేశ వేణుతో (NUDA Chairman) కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. నూతనంగా నిర్మించాల్సిన మురుగు కాలువల ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలను పరిశీలించి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవకాశమున్నచోట జేసీబీ వినియోగించాలని, వీలుకాని చోట పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించాలన్నారు.
గతంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Chairman of the State Urdu Academy) తాహెర్ బిన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ (Chairman of the District Library Association) అంతిరెడ్డి రాజిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ ఆనంద్ సాగర్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.