అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy )పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్రెడ్డి మాటల మనిషి.. మూటల మనిషి అని ఆయన వ్యాఖ్యానించారు. గద్వాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని రేవంత్ అన్నారని పేర్కొన్నారు. ఎన్నిరోజులు కాంగ్రెస్(Congress)ను భరించాలని ప్రజలంటున్నారని కేటీఆర్ అన్నారు. నిందలు, దందాలు, చందాలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరని ఆయన ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
KTR | వారికి బుద్ధి చెప్పాలి
సీఎం మానసికస్థితిపై అనుమానం కలుగుతోందని కేటీఆర్ అన్నారు. ఓవైపు రాష్ట్రం దివాలా తీసిందని అంటూ.. మరోవైపు తెలంగాణ రైజింగ్(Telangana Rising) అంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై నిందలు వేయడం, కాంట్రాక్టర్ల దగ్గర దందాలు చేయడం, ఢిల్లీకి చందాలు పంపడంతోనే.. రాష్ట్రాన్ని నడుపుతోందని విమర్శించారు.