అక్షరటుడే, వెబ్ డెస్క్ : KTR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో (Erravalli farmhouse) ఆదివారం తన తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
కాగా ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), కేసీఆర్ కు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె లేఖపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ లో అంతర్యుద్ధం మొదలయిందని ప్రచారం జరుగుతోంది. గులాబీ శ్రేణుల్లో సైతం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ (KCR And KTR) సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత లేఖపై (Kavitha Letter) వారు చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సమావేశంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.