అక్షరటుడే, ఇందూరు: Former MLA Prabhakar | బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్(KTR), కవిత(Kavitha) తీవ్రంగా పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే(Former MLA), బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) కుటుంబం కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కేవలం కేటీఆర్.. కవిత కోసమే పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.
లిక్కర్ స్కాం(Liquor scam)లో జైలుకు వెళ్లిన కవిత.. ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం వరంగల్ లో నిర్వహిస్తున్న సభ ఎవరికోసమో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) కు ఇవి చివరి రోజులన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, శ్రీకాంత్, విజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.