ePaper
More
    HomeజాతీయంMaharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో దుర్మార్గం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను చంపిందో కసాయి పెళ్లాం. తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పైకి ఏర్పడకుండా టైల్స్ కూడా వేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లా (Palghar district) లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

    Maharashtra : వివరాల్లోకి వెళ్తే..

    ధనివ్​ బాగ్ ప్రాంతంలో విజయ్ చౌహాన్​ (34), చమన్ అలియాస్​ గుడియా దేవి (32) దంపతులు ఉంటున్నారు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా గుడియా దేవికి వీరి ఇంటి పక్కనే ఉండే మోను విశ్వకర్శ (33) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

    READ ALSO  Congress Party | జాతి గౌర‌వాన్ని దెబ్బ తీసిన మోదీ.. ప్ర‌ధానిపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శలు

    ఈ క్రమంలో వీరి అక్రమ బంధానికి విజయ్​ అడ్డుగా ఉన్నాడని గుడియా, విశ్వకర్మ భావించారు. అతడిని కడతేర్చాలని ప్లాన్​ వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వారు కలిసి అమాయక భర్త విజయ్​ను ఇంట్లోనే హత్య చేశారు.

    అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. ఏకంగా ఇంట్లోనే గొయ్యి తవ్వారు. అందులో పాతిపెట్టి, పైన ఏర్పడకుండా కొత్త టైల్స్ వేశారు.

    Maharashtra : చేసిన పాపం దాగదుగా..

    ఇదిలా ఉంటే విజయ్​ తోబుట్టువులు ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు మనీ అవసరం కావడంతో విజయ్​ సాయం కోసం వచ్చారు. విజయ్​కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్​ఆఫ్​ రావడంతో నేరుగా ఇంటికి వెళ్లగా.. తన భర్త కుర్లా వెళ్లినట్లు గుడియా చెప్పి, వారిని వెనక్కి పంపించింది.

    READ ALSO  Vice President Dhankhar | భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేదు.. ఏకం చేస్తుంద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

    కొద్ది రోజులకు (జులై 19) వారు గుడియాకు ఫోన్​ చేశారు. విజయ్​ వచ్చాడో లేదో తెలుసుకోవడానికి. కానీ, వారికి గుడియా ఫోన్​ Phone కూడా స్విచ్​ ఆఫ్​ అని వచ్చింది. దీంతో విజయ్ తోబుట్టువులు అనుమానంతో పెల్హార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్​ ఇంటిని House పరిశీలించారు. ఫ్లోర్​పై కొత్త టైల్స్ కనిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూడగా.. విజయ్​ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

    స్థానిక తహసీల్దార్​ tehsildar నేతృత్వంలో వైద్యులు Doctors, ఫోరెన్సిక్​ forensic నిపుణులు ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్​మార్టం నిమిత్తం ముంబయి (Mumbai) లోని జేజే ప్రభుత్వ ఆసుపత్రి (JJ Government Hospital) కి మృతదేహాన్ని పంపించారు.

    Latest articles

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    More like this

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...