అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Cards | కొత్త రేషన్ కార్డుల (new ration cards) కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త కార్డులు అందించడానికి చర్యలు చేపట్టింది. కొత్త కార్డులు వచ్చిన వారికి మే నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతోపాటు మెంబర్లను యాడ్ కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం (congress govt) వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తులు, కుల గణన సర్వే ఆధారంగా ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తోంది. అంతేగాకుండా పాత కార్డుల్లో మెంబర్లను యాడ్ add చేస్తోంది. వచ్చిన దరఖాస్తులను (applications) వెరిఫై చేస్తూ అధికారులు కార్డులు జారీ చేయడంతో పాటు, కొత్త వారిని యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే పాత కార్డుల్లో పలువురిని యాడ్ చేయగా.. వారికి ఏప్రిల్లో బియ్యం కూడా వచ్చింది. అయితే మొత్తం ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
Ration Cards | మేలో కొత్త కార్డులు..
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు రావడంతో విడతల వారీగా కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మే నెలలో తొలివిడతలో కొందరికి కార్డులు ఇచ్చి బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త కార్డులు మంజూరు చేస్తే బియ్యం కోటా కూడా పెరగనుంది.