అక్షరటుడే, హైదరాబాద్: Saraswati Pushkaram : భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరస్వతీ పుష్కరాలు రానే వచ్చేశాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం kaleshwaram వద్ద ఈ నెల 15 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
సరస్వతీ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని cm revanth reddy దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ minister konda surekha ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు minister sridhar Babu, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కి pcc chief Mahesh Kumar goud సైతం మంత్రి ఆహ్వాన పత్రిక అందించారు. కాగా, పుష్కరాల ఏర్పట్ల గురించి మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.