అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో phone tapping case మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ brs హయాంలో కీలక స్థానాల్లో పని చేసిన ఉన్నతాధికారులను విచారించడానికి దర్యాప్తు బృందం యత్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు నాటి ఎస్ఐబీ sib ఓఎస్డీ ప్రభాకర్రావు prabhakar rao కొంతకాలంగా అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు.
Phone Tapping Case | రివ్యూ కమిటీ అనుమతితోనే..
ప్రభాకర్రావు తరఫు న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ ఎస్ఐబీలో లీగల్గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. రివ్యూ కమిటీ అనుమతితోనే 2023 డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామని కోర్టుకు ప్రభాకర్రావు తెలిపారు. దీంతో దర్యాప్తు బృందం నాటి రివ్యూ కమిటీ సభ్యులను విచారించడానికి సిద్ధం అవుతోంది. ఇందులో నాటి సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులు ఉండటం గమనార్హం.
Phone Tapping Case | బెయిల్ పిటిషన్ కొట్టివేత
అమెరికాలో ఉన్న ప్రభాకర్రావు prabhakar rao తాను అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నట్లు కోర్టుకు తెలిపాడు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.