అక్షరటుడే, వెబ్డెస్క్ : Ceasefire | భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణను (Ceasefire) అంగీకరించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (pm modi) కీలక సమావేశం నిర్వహించారు. ఆయన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జాతీయ భద్రత సలహాదారు NSA అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) అనంతర పరిణామలు, కాల్పుల విమరణ, తాజా పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ చర్చల అనంతరం కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ Ceasefire అమలులోకి వచ్చింది. అయితే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి (Ceasefire violation) శనివారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాపై దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు.
కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే సోమవారం ఇరుదేశాల ఆర్మీ జనరల్స్ (army generals) సమావేశంపై కూడా భేటీలో చర్చించనున్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ మీడియాకు వివరాలు వెల్లడించనుంది.