అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు(Former SIB chief Prabhakar Rao) నేడు ఇండియాకు రానున్నారు. గతేడాది మార్చిలో కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా(America)కు వెళ్లిపోయారు. నాటి నుంచి పోలీసులు ఎన్ని నోటీసులు పంపినా స్పందించలేదు. అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నాలు చేశారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాడు. అయితే దీనిపై దర్యాప్తు అధికారులు అమెరికా ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ఆయనను భారత్(India)కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది.
Phone Tapping Case | సుప్రీం ఆదేశాలతో..
అమెరికా రెడ్ కార్నర్ నోటీసులు(America Red Corner Notices) అమలు చేసి తనను ఇండియాకు పంపుతుందని భావించిన ప్రభాకర్రావు ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు. తన పాస్పోర్టు ఇవ్వాలని పిటిషన్ వేశాడు. దీంతో పాస్పోర్ట్ ఇచ్చి వన్టైం వీసా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్(Hyderabad) చేరుకోనున్నారు. కాగా.. రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే అమెరికాలో కేటీఆర్(KTR) పర్యటన సందర్భంగా ఆలస్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ కేటీఆర్తో ప్రభాకర్ సమావేశమైనట్లు సమాచారం. కాగా.. ఈ నెల 9న సిట్(Sit) ఎదుట విచారణకు హాజరు అవుతానని ప్రభాకర్ రావు తెలిపారు.