అక్షరటుడే, హైదరాబాద్: phone tapping case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana phone tapping case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 5న సిట్ విచారణకు ప్రభాకర్రావు(Prabhakar Rao) హాజరవుతున్నారని తెలిసింది. విచారణకు హాజరవుతానని సిట్కు ప్రభాకర్రారే స్వయంగా తెలియజేసినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో అమెరికా నుంచి ప్రభాకర్రావు తిరిగి రాబోతున్నారు. సిట్ విచారణ(SIT inquiry)కు సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు ఆయన అండర్ టేకింగ్ లేఖ ఇవ్వడం గమనార్హం. వన్ టైం ఎంట్రీ పాస్పోర్టు అందిన వెంటనే ప్రభాకర్రావు భారత్కు రానున్నారు.
పాస్పోర్టు అందిన మూడు రోజుల్లో భారత్కు రావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈయన 14 నెలలుగా అమెరికా(America)లోనే ఉంటున్నారు. కాగా, ప్రభాకర్రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రావొచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది.