అక్షరటుడే, హైదరాబాద్:CM Revanth Reddy | ఇదిగో అదిగో కేబినెట్ విస్తరణ..! అంటూ గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ తెరపైకి వస్తోంది. ఇటీవలే ఇక ఫైనల్కు వచ్చిందని ప్రచారం జరిగింది. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఒకే అనగానే ప్రకటిస్తారని అన్నారు. కానీ, మళ్లీ వాయిదా పడటంతో ఆశావహులు ఉసూరుమన్నారు. ఇలాంటి తరుణంలో ఆసక్తికర మరిణామం చోటుచేసుకుంది.
CM Revanth Reddy | మంత్రులకు స్పెషల్ విందు ఎందుకు!
మంత్రులందరికీ బంజారాహిల్స్ (Banjara Hills) లోని తన ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రైవేటు డిన్నర్ పార్టీ అరెంజ్ చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్చలీ చర్చకు వచ్చింది. సీఎం పిలుపుతో దాదాపుగా మంత్రివర్గం (Ministerial Council) మొత్తం సీఎం ఇంటికి చేరిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన డిన్నర్ను ఆరగించింది! ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఈ డిన్నర్ ఎందుకనేదానిపై చర్చ నడుస్తోంది.
విందు పేరుతో మంత్రులు ఏం చర్చించుకున్నారు..? ముఖ్యమంత్రి వాళ్లకు ఏం చెప్పారు? అనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ బెర్త్(Cabinet Berth) కోసం ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్కంఠకు కారణం అయింది. విస్తరణకు ముందు ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఇచ్చే డిన్నర్ అంటూ ప్రచారం జరుగుతోంది.
CM Revanth Reddy | రంగంలోకి మీనాక్షి నటరాజన్
కాగా.. మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాది కాలంగా పెండింగులో ఉంది. సామాజిక సమీకరణాల కారణంతో అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఆశావహులు మూడింతలు పెరిగారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు తమ తమ సామాజిక వర్గాలుగా విడిపోయారు. రహస్యంగా భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీకి జలక్ ఇస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. అన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరి అందరినీ బుజ్జగించి.. ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారా..? లేక ఎప్పటిలాగే మళ్లీ చూద్దామని వదిలేస్తారా..? అనేది త్వరలోనే స్పష్టత రానుంది.