Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్​లో కీలక పరిణామం.. కసిరెడ్డి అరెస్ట్​
Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్​లో కీలక పరిణామం.. కసిరెడ్డి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Liquor Scam | ఆంధ్రప్రదేశ్​  లిక్కర్​ స్కామ్ AP Liquor Scam కేసు​లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్​ కసిరెడ్డి Raj Kasireddyని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్​సీపీ YSRCP హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సిట్ liquor case sit​ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఇన్నిరోజులుగా పరారీలో ఉన్నారు.

ఇప్పటికే సిట్​ SIT ఆయనకు మూడుసార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. దీంతో గతంలో హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో సిట్​ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం మాజీ ఎంపీలు విజయిసాయి రెడ్డి Mp vijaya sai reddy, మిథున్​రెడ్డి mithun reddyని లిక్కర్​ స్కామ్​ కేసులో విచారించారు.

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్​ కసిరెడ్డి సోమవారం దుబాయి నుంచి హైదరాబాద్ Hyderabad​ రాగా.. ఏపీ పోలీసులు ఎయిర్​పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్​ కోసం వేసిన పిటిషన్​పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.