అక్షరటుడే, వెబ్డెస్క్ :IAS Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులు అదనపు బాధ్యతలు(Additional Responsibilities) అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా కొనసాగుతున్న 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కే శశాంకకు TGIICE వీసీ, ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఐఎఫ్ఎస్ విష్ణువర్ధన్రెడ్డి(IFS Vishnuvardhan Reddy)ని తప్పించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వల్లూరు క్రాంతికి మైన్స్(Vallur Kranthik Mines), జియోలజీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. శశాంకను ఆ పోస్టు నుంచి రిలీవ్ చేసి, క్రాంతికి బాధ్యతలు అప్పగించారు.సెర్ప్ సీఈవోగా కొనసాగుతున్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాత్యాయని దేవికి రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(Joint Managing Director) బాధ్యతలు అప్పగించారు.ఖమ్మం మెప్మా పీడీగా ఉన్న పి మహేందర్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు.