ePaper
More
    HomeతెలంగాణLand Market Values | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో భూముల ధరల పెంపు

    Land Market Values | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో భూముల ధరల పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Market Values | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో కొత్త స్టాంప్‌ సవరణ బిల్లు (Stamp Amendment Bill)ను తీసుకు రానుంది. దీంతో భూముల ధరలు పెరగనున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్‌ విలువల (Markett Values) కు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti) సూచించారు.

    Land Market Values | మహిళలకు గుడ్​న్యూస్​

    ఇళ్లు, ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే మహిళలకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పనుంది. భూముల ధరలు పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని నిర్ణయించింది. కొత్త సవణ బిల్లు అమలులోకి వస్తే స్టాంప్​ డ్యూటీ (Stamp Duty) 6 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్​ సమయంలో ఆస్తి విలువలో 0.5శాతం రిజిస్ట్రేషన్​ ఛార్జీలు వసూలు చేస్తారని తెలిసింది. ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు సైతం సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    READ ALSO  Philippines | పుట్టిన రోజునాడే కన్నుమూత.. ఫిలిప్పిన్స్ లో కామారెడ్డి జిల్లా వైద్య విద్యార్థి మృతి

    Land Market Values | గతంలోనే ప్రయత్నాలు

    కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే భూముల ధరలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీని కూడా వేసింది. ప్రస్తుత మార్కెట్ విలువకు స్టాంప్​ డ్యూటీ శాఖ పొందుపరిచిన విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో రేట్లు సవరించాలని గతంలో భావించిన ప్రభుత్వం తర్వాత అనివార్య కారణాలతో వెనక్కి తగ్గింది. తాజాగా భూముల ధరలను సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర పెంపు ఉంటుందనే విషయమై స్పష్టత లేదు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...