ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | కేబినెట్​ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

    Local Body Elections | కేబినెట్​ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్ర కేబినేట్​ (State Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామని ప్రకటించింది.

    గురువారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం భేటీలో చర్చించిన అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) మీడియాకు వెల్లడించారు.

    ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణన పక్కాగా చేశామని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్​ (BC Reservations) ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించామన్నారు. అయితే కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపడం లేదని.. అయినప్పటికీ న్యాయపరంగా చిక్కులు లేకుండా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనికోసం 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని కూడా సవరిస్తామన్నారు.

    READ ALSO  Nizamabad Arya Vaishya Sangam | పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడిగా దన్‌పాల్‌ శ్రీనివాస్

    Local Body Elections | 25న మళ్లీ కేబినెట్​ భేటీ

    ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 19 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించిందన్నారు. గతంలో నిర్వహించిన 18 కేబినెట్​ మీటింగ్​లలో 321 నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయాల అమలుపై దేశంలో ఎక్కడా లేనివిధంగా గురువారం చర్చించామన్నారు. కేబినెట్​ గతంలో చర్చించిన 96శాతం పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు వారాలకోసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని గతంలో సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా 25న మళ్లీ కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

    Local Body Elections | రెండు యూనివర్సీటీల ఏర్పాటుకు ఆమోదం

    రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పొంగులేటి తెలిపారు. అమిటీ యూనివర్సిటీ (Amity University), సెంట్​ మేరీ విద్యా సంస్థలకు కూడా యూనివర్సిటీగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమిటీ యూనిర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా గోశాలల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్​, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్షణ్​ పాల్గొన్నారు.

    READ ALSO  Bheemgal Mandal | కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఉప సర్పంచ్

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...