అక్షరటుడే, ఇందూరు: Nizamabad Police : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆరో ఠాణా పరిధిలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ community contact programme కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతంలో అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లను నిశితంగా తనిఖీ చేశారు. సరైన ఆధారాలు, నంబరు ప్లేట్లు లేని 26 ఆటోలు, 42 మోటారు సైకిల్ లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ధర్మపురి హిల్స్ కాలనీవాసులను ఉద్దేశించి నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి acp raja venkat reddy మాట్లాడారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాత్రిపూట రోడ్లమీద అనవసరంగా తిరగవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి అమ్మితే సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలన్నారు.
కమ్యూనిటీ కాంటాక్ట్ లో సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ south rural ci suresh, వన్ టౌన్ సీఐ రఘుపతి ci raghupathi, నగర సీఐ శ్రీనివాసరాజు town ci srinivasa raju, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ north rural ci shrinivas, వుమెన్ పీఎస్ సీఐ శ్రీలత, డిచ్పల్లి సీఐ మల్లేష్ dichpally ci Mallesh, ధర్పల్లి సీఐ భిక్షపతి dharpally ci bhikshapati, ఆరో ఠాణా ఎస్ఐ వెంకట్రావ్, నిజామాబాద్ సబ్ డివిజన్కి చెందిన 12 మంది ఎస్ఐలు, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.